4/8/14

మా తాతగారి సుందరకాండము








ఎన్నాళ్ళు గానో రాయాలనున్నా ఎలా మొదలు పెట్టాలో తెలియక వాయిదా వేస్తూ వస్తున్నాను.
మొదటిగా నేను కొంచెం కన్ఫెస్ చెయ్యాలి. మన మధ్యే మనతోనే వున్న వాళ్ళ విలువ మనకి అంతగా తెలియదు. మనకి చాలా ఆక్సెసిబిల్ గా వుండే సరికి ఎప్పుడన్నా తెలుసుకోవచ్చులే అన్న నిర్లక్ష్యం వచ్చేస్తుంది. తాతగారు సంస్కృతం పాఠాలు చాలా బాగా చెప్పేవారు. నా చిన్నప్పుడు బాచ్ లు బాచ్ లు గా ఇంటర్మీడియట్ పిల్లలు ప్రైవేట్ కి వస్తూ రోజంతా ఎక్కడా ఖాళీ లేకుండా వుండే తాతగారు బాగా గుర్తే. సంస్కృతం పాఠాలు ఎంత బాగా చెప్పేవారో, ఇంగ్లీష్ పాఠాలు కూడా అంత బాగా చెప్పేవారు.

నేను ఇంటర్ కి వచ్చాక ఇంగ్లీష్ పొయెట్రీ బాగా చెప్పించుకునేదాన్ని గానీ సంస్కృతం అంటే మాత్రం మహా నిర్లక్ష్యం గా వుండే దాన్ని. సంస్కృతం లో ప్రశ్నలకి మొత్తం జవాబు తెలుగులో రాసేసి అక్కడక్కడా సంస్కృతం కొటేషన్ లు రాసేవాళ్ళం. మాతో నాలుగు రోజులు వుందామని వచ్చిన తాతగారు అలా కాదని ఒక పాఠం మొత్తానికి సంస్కృతంలోనే నోట్స్ ప్రిపేర్ చేసి నేను కాలేజీ నుంచి వచ్చేసరికి నాకు చెప్పాలని ఎదురు చూస్తున్నారు. నాకు ఆయన చెప్పేది ఛాదస్తం లాగే అనిపించింది అప్పుడు. అవతల నా బుర్రకెక్కని లెక్కలు, ఫిసిక్స్, కెమిస్ట్రీ భయంకరంగా భయపెడుతుంటే సంస్క్రుతం కోసం ఇంత టైమ్ వేస్ట్ చెయ్యాలా అనిపించింది. ఆయనకేదో సాకు చెప్పి తప్పించేసుకున్నాను.

నేను ఎంత మంచి అవకాశాలు వదిలేసుకున్నానో. ఎన్ని తెలుసుకోకుండా అందరితో పాటూ కొట్టుకుపోవడానికే మొగ్గు చూపించానో తెలుసుకునే పరిపక్వత నాకు వచ్చేసరికి తాతగారు నాకు అందనంత దూరం వెఌపోయారు.

ఇంక ప్రస్తుతంలోకి వస్తే రెండేళ్ళ క్రితం అనుకుంటా మా నాన్నగారు చాలా సంబరంగా చెప్పారు తన బాల్య మితృడు, తాతగారి శిష్యుడూ తనని చూడడానికి వచ్చారనీ, మాటల మధ్యలో తాతగారు రాసిన సుందర కాండ పుస్తకం చూసి దీనిని పునర్ముద్రిద్దాం అన్నారనీ.

నాకెంత, నాకేంటీ అనే మనుషుల మధ్య, ఇంచుమించు అదే మనస్తత్వం ఆకఌంపు చేసేసుకుని అదే సరైన పధ్ధతి అన్న మైండ్ సెట్ లోకి వెఌపోయిన నాకు, "ఆ ఏదో అంటారు గానీ" అనే అనిపించింది.

కానీ నేననుకున్నట్టూ కాకుండా, నా ఆలోచనా ధోరణి తప్పని నిరూపిస్తూ ఆ ప్రోజెక్ట్ ని చాలా వేగంగానే కార్యాచరణ లోకి తీసుకొచ్చారు. అప్పటివరకూ రిటైర్ ఐపోయాను, ఇంకేముందిలే అన్నట్టు కాస్త నిరుత్సాహంగా వుండే నాన్నగారు కూడా వుత్సాహంగా దీనికోసం పని చెయ్యడం మొదలెట్టారు. ఎప్పుడు ఫోన్ చేసినా చాలా చెలాకీగా పుస్తకం విశేషాలు చెప్పేవారు.

ఈ మొత్తం ప్రోసెస్ లో ఎక్కడా రాజీ పడకుండా మంచి క్వాలిటి తో, లుక్ తో పుస్తకం రూపు దిద్దడంలో ప్రముఖంగా చెప్పుకోవలసినది శ్రీ తులసి సుబ్బారావు గారి గురించి. 8 వాల్యూములుగా వచ్చినదాన్ని 3 పుస్తకాలుగా మార్చారు. అలోచనా, ఆచరణా ఆయనవైతే, మా నాన్నగారి ఇంకొక మితృలు శ్రీమాన్ తూపురాణి నమ్మళ్వార్ మరియూ మా నాన్నగారివి సహాయ సహకారాలు.

చాలా అందంగా ముస్తాబు చేసిన ఆ పుస్తకాన్ని గత ఫిబ్రవరి లో హైదరాబాద్ లో శ్రీ తులసి సుబ్బారావు గారి ఇంట్లో చక్కటి ఆత్మీయ వాతావరణం లో ఆవిష్కరించారు.

500 కాపీలు వేసి అందులో 150 నాన్నగారికి ఇచ్చారు. అవి ఇంటికి తీసుకొచ్చాక వస్తున్న స్పందన కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. చాలా మంది ఎంతో ఆసక్తి తో వచ్చి అడిగి తీసుకుంటున్నారు. చాలా కష్టపడితే గానీ అప్పాయిమెంటు కూడా దొరకని కొందరు కూడా ఈ పుస్తకం ఇవ్వాలని వెఌతే చాలా సేపు మాట్లాడి,  అభినందిస్తున్నారని అమ్మా, నాన్నగారూ మురిసిపోతూ చెబుతున్నారు.

తాతగారు అప్పట్లో అంత కష్టపడి రాసినా, 8 వాల్యూములు ఒకేసారి ముద్రణ జరగకపోవడం వల్ల రావలసినంత ఆదరణ రాలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు అనుకున్నకన్నా చాలా మంచి స్పందన వస్తోంది. ఇంత మంచి శిష్యులని సంపాదించారూ అంటే తాతగారు ఎంత గొప్ప గురువో కదా అనిపిస్తోంది ఇప్పుడు.

అమ్మా నాన్నగారూ చెప్తున్న విశేషాలు వింటుంటే కలుగుతున్న ఆనందాన్ని మీతో పంచుకోవాలనీ. ఈ పుస్తకం విషయం లో శ్రీ తులసి సుబ్బారావు గారూ, శ్రీమాన్ తూపురాణ్ నమ్మాళ్వార్ గారూ చేసిన కృషికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనీ ఈ టపా రాస్తున్నాను.

ఈ పుస్తకం గురించి నాన్నగారి మాటలు ఇక్కడ..












No comments: